వేదాంత ధోరణి హాట్ బ్యూటీ వ్యాఖ్యలు

బాలీవుడ్ హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తన ప్రతిభతో హాలీవుడ్ సినిమాలు మరియు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ల్లో కూడా నటించి గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా నిలిచింది. హాలీవుడ్ లో కూడా అభిమానులను దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ కలిగిన సెలబ్రెటీల జాబితాలో నెం.1 గా నిలిచింది.

ఈ అమ్మడు ప్రస్తుతం అమ్మతనం ను ఆస్వాదిస్తుంది. సరోగసి ద్వారా తల్లి అయిన ఈ అమ్మడు ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది. తనకంటే పదేళ్లు వయసు తక్కువ అయిన కుర్రాడిని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు వైవాహిక జీవితం పరంగా కూడా చాలా సంతోషంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

తాజాగా ఈ అమ్మడు ఒక చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు కాస్త విడ్డూరంగా ఉన్నాయి అనిపిస్తుంది. ప్రస్తుతం మీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తారు అంటూ ప్రశ్నించగా ఆమె నుండి తమ బిడ్డ కోసం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తామనే సమాధానం వస్తుందని అంతా ఊహించారు.

కాని ఆమె ప్రస్తుతం కరోనా కాలం కనుక జీవితంలో అత్యంత ప్రాముఖ్యత శాంతికి ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ సమయంలో నేను శాంతికి ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు నా జీవితంలో అత్యంత కీలకమైన వాటికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి… కనుక ఆందోళన పడి ఇతర విషయాలకు ప్రాముఖ్య ఇవ్వకూడదు.

ప్రియాంక చోప్రా వేదాంత ధోరణిలో మాట్లాడటం ఆమె అభిమానులకు ఆశ్చర్యం ను కలిగిస్తుంది. కరోనా మహమ్మారి దాదాపుగా కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఇంకా ఆ ట్రాన్స్ లోనే ప్రియాంక చోప్రా ఉందేమో అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా ముందు ముందు అయినా ఆ భయం నుండి బయట పడి జీవితాన్ని ఎంజాయ్ చేయాలని.. ఆమె సాధించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న మీరు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు ఆమె పోస్ట్ లకు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అమ్మతనం ను ఎంజాయ్ చేయాలని.. ముందు ముందు మీ నుండి మంచి ప్రాజెక్ట్ లను ఆశిస్తున్నామని ఆమె సన్నిహితులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: