టైగర్ కి దూరంగా దిశా పటానీ? అసలేం జరిగింది!

బాలీవుడ్ సెలబ్రిటీ ఇంట పార్టీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆహ్వానం అందాలే గానీ బాలీవుడ్ అంతా దిగిపోతుంది. పెళ్లైన వాళ్లు సతీసమేతంగా హాజరవుతుంటారు. పెళ్లి కాని ఉడ్ బీలతో పార్టీలో చిల్ అవుతుంటారు. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న కల్చర్ ఇది. ఇటీవలే దర్శక-నిర్మాత కరణ్ జోహార్ 50 వ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

దాదాపు బాలీవుడ్ ఫేమస్ కపుల్స్ అంతా హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్… కత్రినా కౌఫ్-విక్కీ కౌశల్. సైఫ్ అలీఖాన్ కపూర్-కరీనా కపూర్ జంటలతో పాటు సారాఅలీఖాన్..జాన్వీకపూర్ సహా నవ నాయికలు అంతా హాజరయ్ఆరు. గతంలో ఈ భామా మణులు ఇద్దరు ఎఫైర్లు నెరిపిన యంగ్ హీరోలు సైతం పాల్గొన్నారు.

అయితే దిశా పటానీ- టైగర్ ష్రాప్ మాత్రం ఎవరికి వారుగా ఒంటరిగా పార్టీకి హాజరై అందరికీ షాక్ ఇచ్చారు. టైగర్ ష్రాప్ సింగిల్ గానే కారు నుంచి దిగి ఎంట్రీ వద్ద ఫోటో సెషన్ లో పాల్గొన్నాడు. అలాగే దిశా పటానీ కూడా ఒంటరిగానే పార్టీకి హాజరైంది. దీంతో ఇద్దరి మధ్య బంధం వీగిపోయిందా? అంటూ సోషల్ మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి.

ఇద్దరు కొన్నాళ్లగా గుట్టు చప్పుడుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. కలిసి హాలీడేలు.. డిన్నర్లు.. పార్టీలు అంటూ బీ-టౌన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాకి చాలాసార్లు చిక్కారు. ఒకరి బర్త్ డే పార్టీని మరోకరు సెలబ్రేట్ చేస్తుంటారు. ఇన్ స్టా వేదికగా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని జనాలకి తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారు. వివాహానికి సైతం రెడీ అవుతున్నట్లు కొద్ది రోజులుగా మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కిస్తున్నాయి. కానీ కరణ్ పార్టీ నాటి రోజు సన్నివేశంతో మొత్తం తారుమారుగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఆ క్లోజ్ నెస్ ఎక్కడా కనిపించలేదు.

ఎవరికి వారు వేర్వేరుగా కరణ్ కి విషెస్ చెప్పడం నుంచి పార్టీలో పాల్గొనడం వరకూ ఎవరి పని వారిదే అన్న తీరుగా ప్రవర్తించారు. పార్టీలో ఎక్కడా మాట్లాడుకున్న సన్నివేశం చోటు చేసుకోలేదు. దీంతో ఇద్దరి బాండింగ్ కి బ్రేక్ పడిందా? అన్న కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది.

క్లోజ్ గా మూవ్ అయ్యే ఆ జంట కి ఏమైందంటూ సోషల్ జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీటలికి ఈ జంట ఎలాంటలి బధులిస్తుంది? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఇద్దరు బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దిశా పటానీ తెలుగులో ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.


Recent Random Post: