విరూపాక్ష చూసే వాళ్ళకు ఒక రిక్వెస్ట్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు సినిమా తీసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.

కాగా తాజాగా సినిమా బృందం సినిమా చూసిన ప్రేక్షకులకు స్పెషల్ రిక్వెస్ట్ లు చేయడం విశేషం. సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉంటాయని వాటిని ముందుగానే లీక్ చేయవద్దని కోరారు. ‘సినిమాలోని కీలక అంశాలు ట్విస్ట్ లు దయచేసి ఎక్కడా లీక్ చేయకండి . వెండి తెరపై సినిమా చూసి ఓ అద్భుతమైన అనుభవాన్ని పొందండి’ అంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం విశేషం.

ఈ సినిమా మొత్తం రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగుతుందని సినిమాలో చాలా ట్విస్ట్ లు థ్రిల్స్ ఉన్నాయని కొద్దిగా హర్రర్ గా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా హిట్ అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన నుంచి రెండేళ్ల తర్వాత వచ్చిన సినిమా ఇది. 2021 లోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

కానీ ఆయన రోడ్డు ప్రమాదానికి గురికావడం దాని నుంచి కోలుకోని మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సమయం పట్టింది. అందుకే ఈ ఏఢాది విడుదల అయ్యింది.

చాలా కాలం తర్వాత తన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సాయి ధరమ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఆశలు నిరాశలు కాకుండా సక్సెస్ అవ్వడంతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు.

సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆయన స్వయంగా థియేటర్స్ కి కూడా వెళ్లడం గమనార్హం. కాగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీ గా సంయుక్త మేనన్ నటించారు. ఆమె ఈ మూవీలో కాస్త హాట్ గా కనిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సుకుమార్ రాయడం విశేషం.


Recent Random Post: