మహేష్ – షారుఖ్.. నిజంగా కలుస్తారా?

బాలీవుడ్‌ స్టార్​ హీరో షారుక్​ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు సూపర్ స్టార్​ మహేశ్‌బాబు తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆయన కోరుకున్నారు. అయితే దీనిపై షారుక్​ స్పందించారు. మహేశ్‌తో కలిసి తాను కూడా సినిమాను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లు బదులిచ్చారు.

“థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. ‘జవాన్‌’ నీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటున్నావో చెప్పు.. నేనూ నీతో కలిసి సినిమాకు వస్తాను. నీకు, నీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు” అంటూ షారుఖ్​ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్​గా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ.. ఎక్స్​ ట్విట్టర్​లో సీని ప్రియుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

ఇకపోతే షారుఖ్‌ – మహేశ్‌ బాబు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ సమయంలో షారుఖ్‌ సెట్స్​కు ప్రత్యేకంగా వెళ్లి మరీ మహేశ్‌ను కలిశారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ ఫొటోలు కూడా అప్పట్లో నెట్టింట్లో తెగ వైరల్‌ అయ్యాయి.

ఇక, జవాన్‌ విషయానికి వస్తే,.. తమిళ దర్శకుడు అట్లీ – షారుఖ్‌ కాంబోలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఈ సినిమాలో షారుఖ్‌ దాదాపు 7 గెటెప్స్‌లో కనిపించనున్నారు. రా ఆఫీసర్​గా, పోలీస్ అధికారిగా, హైజాక్ చేసే వ్యక్తిలా, తండ్రి కొడుకులుగా.. రకరకాలుగా కనిపించనున్నారు. నయనతార ఇన్వెస్టిగేటివ్​ ఆఫీసర్​గా కనిపించనుంది. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె అతిథి పాత్రలో యాక్షన్ సీన్స్​లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలు భారీగానే పెంచాయి.

ఇంకా అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, అల్లు అర్జున్, విజయ్‌ దళపతి కూడా గెస్ట్ రోల్స్​ పోషించినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ కీలక సీన్​లో హిందీ వెర్షణ్​లో సంజయ్‌ దత్‌ , తమిళ వెర్షన్‌లో అదే పాత్రను విజయ్‌ దళపతి, తెలుగులో అల్లు అర్జున్‌ పోషించనున్నట్లు కథనాలు వస్తున్నాయి.


Recent Random Post: