ప్రభాస్ కి, అనుష్క రెసిపీ ఛాలెంజ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రభాస్ గురించి ఫ్యాన్స్ కి తెలిసిన కామన్ విషయం ఏమిటంటే ఫుడ్. ఆయన ఫుడ్ ని ఇష్టంగా లాగించేస్తారు. అంతేకాదు, తనతో పనిచేసిన నటీనటులకు కూడా విపరీతంగా ఫుడ్ పెడుతూ ఉంటారు. ఆఖరికి తన పెదనాన్న కృష్టం రాజు చనిపోయినప్పుడు చూడటానికి వచ్చిన అభిమానులకు సైతం ప్రభాస్ రకరకాల వంటలు వండి, వారు ఇబ్బంది పడకుండా చేశారు.

అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? తాజాగా ఈ విషయాన్ని ప్రభాస్ బయటపెట్టారు. ప్రస్తుతం అనుష్క నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీలో అనుష్క చెఫ్ గా కనిపిస్తోంది. దీంతో, ఈ క్రమంలోనే ఆమె మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఓ చిన్న గేమ్ మొదలుపెట్టారు.

దానిలో భాగంగా ఆమె ప్రభాస్ కి ఓ రెసిపీ ఛాలెంజ్ విసిరారు. తనకు నచ్చిన వంటకాన్ని చెప్పి, దానిని ఎలా వండాలో చెప్పడమే కాకుండా, ప్రభాస్ కి నచ్చిన వంటకాన్ని కూడా చెప్పమంది. దీంతో, ప్రభాస్ తనకు రొయ్యల పులావ్ అంటే ఇష్టమని చెప్పాడు. ఇక తదుపరి రామ్ చరణ్ కి రెసిపీ ఛాలెంజ్ విసిరాడు.

ఇంకాలంగా అనుష్కతో పరిచయం ఉన్నా, తనకు ఇష్టమైన ఫుడ్ ఏంటో ఇప్పటి వరకు తనకు తెలీదని, ఇప్పుడే తెలిసిందని ప్రభాస్ చెప్పారు. ఇక, తన ఫ్యాన్స్ కూడా వారి ఫేవరేట్ ఫుడ్ ఏంటో చెప్పాలి అంటూ పేర్కొన్నారు. కాగా, ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రెసిపీ ఛాలెంజ్ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా కొంచెం ముందు మొదలుపెట్టి ఉంటే, సినిమాకు ఎక్కువగా ఉపయోగపడేది అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

ఇదిలా ఉండగా, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు దాదాపు ఐదేళ్ల తర్వాత అనుష్కను చూసే అవకాశం ఉంది. దీంతో, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Recent Random Post: