విజయ్ ఫ్యాన్స్కి ఇది బ్యాడ్ న్యూసే..!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మొన్నటి వరకు `లైగర్` సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటించింది.

బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది.

ఈ మూవీ తర్వాత విజయ్ సుకుమార్తో తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కిస్తాడని అందరూ భావించారు. ఇప్పటికే ఈ మూవీని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.

కానీ లైగర్ షూటింగ్ పూర్తైన వెంటనే పూరీ జగన్నాథ్ అనూహ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `జనగణమన`ను విజయ్తో స్టార్ట్ చేశాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే కాగా.. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.

`జనగణమన` అనంతరం విజయ్ దర్శకుడు శివ నిర్వాణతో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయనున్నాడని.. అందులో సమంత హీరోయిన్గా ఫిక్స్ అయిందని గత కొద్ది రోజుల నుంచీ వార్తలు వస్తున్నాయి. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. ఇటీవల `పుష్ప ది రైజ్`తో ప్రేక్షకులను పలకరించిన ఈయన ఇప్పుడు పుష్ప పార్ట్ 2పైనే తన ఫోకస్ మొత్తం పెట్టాడు.

ఇది పూర్తైన తర్వాత సుకుమార్ మెగా వపర్ స్టార్ రామ్ చరణ్తో ఓ సినిమా చేయనున్నాడని టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా అటకెక్కిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ సినిమా ఉన్నా.. ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇది ఒక రకంగా విజయ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.


Recent Random Post: