సుశాంత్ ఆఖరి సందేశాన్ని రివీల్ చేసిన అతని స్నేహితుడు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఐదు నెలలు దాటింది. ఇంకా సుశాంత్ ది హత్యో, ఆత్మహత్యో, వాటికి గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ గుప్తా ఇన్ని రోజులకు మీడియా ముందుకు వచ్చి సుశాంత్ కు తనకు మధ్య జరిగిన ఆఖరి సంభాషణ గురించి విశేషాలు తెలియజేసాడు.

“సుశాంత్ ఎప్పుడూ జీవితంలో పరిపూర్ణత సాధించాలని చెబుతుండేవాడు. జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యం తనది. నిజం చెప్పాలంటే సుశాంత్ వల్లే నాకు నా జీవితంలో ఒక లక్ష్యం, దాన్ని సాధించాలన్న కసి ఏర్పడింది. స్నేహితులకు సుశాంత్ ఏంతో ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అతని స్నేహితుడు అవ్వడం నిజంగా నా అదృష్టం” అని సిద్ధార్థ్ గుప్తా అన్నాడు.

అయితే సుశాంత్ చనిపోవడానికి ఐదు రోజుల ముందు తామిద్దరం చాట్ చేసుకున్నట్లు రివీల్ చేసాడు. “నిన్ను కుశల్ ఝవేరిను కలవాలని ఉంది. ఆ రోజులు చాలా బాగుండేది కదా అని సుశాంత్ మెసేజ్ చేసాడు. సాధారణంగా అలా సుశాంత్ ఎప్పుడూ మాట్లాడడు. నేను, కుశల్ తో ఇదే విషయం చెప్పి అక్కడ ఏదో జరుగుతోంది అని అనుకున్నాం. త్వరలోనే కలుద్దాం అని కుశల్ మెసేజ్ చేసాడు కూడా. అయితే జరిగేదాన్ని మనం మార్చలేం” అని సిద్ధార్థ్ తెలియజేసాడు.


Recent Random Post: