యుద్ధ బాధితులకు అండగా సోనూసూద్.. వీడియోలు వైరల్

కరోనా సమయంలో నటుడు సోనూసూద్ అందించిన నిస్వార్ధ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నామంటూ ఆయన దృష్టికి తీసుకు వస్తే… చాలు ఆపన్న హస్తం అందించారు. వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక బస్సు లను సైతం ఏర్పాటు చేశారు.

వారికి మంచినీరు ఆహారం అందించారు. అంతేకాకుండా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని ట్వీట్ చేసిన వారికి… పెద్దన్నగా నిలిచారు. వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు లేవన్నవారికి… తనదైన రీతిలో సహాయం చేశారు. ఇలాంటి ఆయన ఈ యుద్ధ నేపథ్యంలోనూ తనదైన రీతిలో సహాయం చేస్తున్నారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు సోనూసూద్ చారిటీ బృందం సాయం చేస్తోంది. అక్కడ చిక్కుకున్న వారిని సరిహద్దులకు చేర్చడానికి సహాయం చేస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్ వరకు అక్కడ ఉన్న విద్యార్థులను తరలిస్తున్నారు. ఇందుకోసం సోనూసూద్ చారిటీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్నామని ఓ చిన్న మెసేజ్ పెడితే చాలు.. చారిటీ సభ్యులు వారి చెంతకు చేరి… ఆపన్నహస్తం అందిస్తున్నారు.

సోనూసూద్ సాయం తో భారత్ కు వస్తున్న ఓ విద్యార్థి ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. స్వదేశానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా సోనూసూద్ టీమ్ సాయం వల్లే తాను ఇవాళ ఇంటికి వస్తున్నందుకు కారణం సోనూసూద్ అని చెప్పుకొచ్చారు.

సోనూసూద్ సాయంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసి… ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై సోనూసూద్ స్పందించారు. ఇది తన బాధ్యత అంటూ పేర్కొన్నారు. తనవంతుగా భారతీయులకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేరకు కామెంట్ చేశారు.

సోనూసూద్ టీం సాయం చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా వారి సాయంతో స్వదేశానికి వస్తున్న విద్యార్థుల వీడియో సందేశాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనూసూద్ సాయం మరోసారి ట్రెండింగ్ గా మారింది. సోనూసూద్ పై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. నీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Recent Random Post: