పేదవారికి మరోసారి ఆపన్నహస్తం అందించిన సోను సూద్

సోను సూద్ గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతలా కష్టంలో ఉన్నవారికి సహాయపడ్డాడో మనందరం చూసాం. చేసిన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. సోను సూద్ మరోసారి తను చేసిన గొప్ప పనితో పెద్ద మనసు చాటుకున్నాడు.

సోను సూద్ తన సొంత రాష్ట్రం పంజాబ్ లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ-రిక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో సోను సూద్ సోదరి, బావ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలను పంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ… “ఇతరులకు సేవ చేయాలన్న గుణాన్ని నా పేరెంట్స్ నుండి పొందాను. ప్రతీ ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి సహాయపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను” అని సోను సూద్ అభిప్రాయపడ్డారు.


Recent Random Post: