బాలు జ్ఞాపకాల్లో సింగర్ సునీత

స్టార్‌ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు సునీత కలిసి ఎన్నో పాటలు పాడి ఆకట్టుకున్నారు. బుల్లి తెరపై వీరి పాటలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సునీత తనకు అత్యంత ఆప్తుడు బాలు గారు అంటూ ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చారు. వారిద్దరి మద్య అనుబంధం గురించి వారి పాటలు చూస్తే అర్థం అవుతుంది. వారిద్దరి స్టేజ్ షో ల్లో వారు ఎంతగా సన్నిహితంగా ఉంటారో అర్థం అవుతుంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయిన సమయంలో సునీత చాలా ఎమోషనల్‌ అయ్యారు.

ఇటీవల ఆమె పెళ్లి చేసుకుని కొత్త జీవితంను మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలో ఆయన లేని లోటును సునీత గారు ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఆయన వీడియోలు మరియు ఫొటోలు మళ్లీ మళ్లీ షేర్‌ చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయనతో కలిసి ఏవండోయ్‌ శ్రీవారు అంటూ పాడిన పాటను షేర్‌ చేశారు. ఆ పాటలో ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి మరీ పాడారు. ఆ పాట అద్బుతంగా ఉంటుంది. వారు పాడితే మరింత అద్బుతంగా వచ్చింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


Recent Random Post: