పెళ్లి కాని ప్రసాద్‌ గా శర్వానంద్‌

శర్వానంద్‌ హీరోగా వరుసగా సినిమాలు అయితే రూపొందుతున్నాయి. కాని ఇటీవల కాలంలో ఈయన సక్సెస్‌ దక్కించుకున్న దాఖలాలు లేవు. దాంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహా సముద్రంతో పాటు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా శర్వానంద్‌ చేస్తున్నాడు. ఇప్పటికే మహాసముద్రం సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు మాత్రం అతి త్వరలో పట్టాలెక్కబోతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్‌ పెళ్లి కాని ప్రసాద్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలో పెళ్లి కాని ప్రసాద్‌ పాత్రలో నటించి నవ్వించాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కామెడీ పాత్ర అయిన పెళ్లి కాని ప్రసాద్‌ పాత్రను శర్వానంద్‌ చేయబోతున్నాడు. ఈ సినిమా తో మళ్లీ శర్వానంద్‌ బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.


Recent Random Post: