యాంకర్ సిల్లీ ప్రశ్నకు చెంపపై కొట్టినట్లు సాయిపల్లవి ఆన్సర్

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నాని తో నటించిన సాయి పల్లవి.. కృతి శెట్టి మరియు మడోనా సెబాస్టియన్ లు వరుసగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ వారు హీరో మరియు ముగ్గురు హీరోయిన్స్ ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సాదారణంగా ఆ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ అంటే చాలా ఎబ్బెట్టు ప్రశ్నలు ఉంటాయి అనే టాక్ ఉంది. అంతా అనుకునే విధంగానే శ్యామ్ సింగ రాయ్ టీమ్ ను కూడా ఆ టీవీ ఛానల్ లేడీ యాంకర్ కాస్త ఇబ్బంది కలిగించే ప్రశ్నలను అడిగింది. ఆ ప్రశ్న వేసినందుకు గాను సాయి పల్లవి సీరియస్ గానే అసహనం వ్యక్తం చేసింది.

శ్యామ్ సింగ రాయ్ సినిమా లో నాని మరియు కృతి శెట్టిల మద్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్ లో ఆ విషయాన్ని చూపించారు. ట్రైలర్ ను చూస్తుంటే కృతి శెట్టి కాస్త స్పీడ్ గానే కనిపిస్తుంది. ఆమె సిగరెట్ తాగడంతో పాటు నానితో అడ్వాన్స్ అయినట్లుగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని యాంకర్ చర్చిస్తూ నాచురల్ స్టార్ నాని ని ఎప్పుడు మేము అలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో చూడలేదు. మా నాని అలాంటి సన్నివేశాల్లో ఎక్కువ నటించలేదు కనుక ఆ సన్నివేశాలు షూట్ చేసిన సమయంలో ఎవరు కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు.. ఎవరు ఇబ్బంది పడ్డారు అన్నట్లుగా యాంకర్ ప్రశ్నించింది. దాంతో సాయి పల్లవి కల్పించుకుని మీరు ఈ ప్రశ్న అడగడమే ఇబ్బందిగా ఉంది అంది.

ఒక సినిమాలో నటించేందుకు పాత్రల కోసం సైన్ చేస్తాం.. అందరం కూడా ఆ పాత్ర కోసం కష్టపడుతాం.. ఆ సమయంలో కంఫర్ట్ గురించి ఇతర విషయాల గురించి ఆలోచించము అంది. ఆ సమాధానం తో యాంకర్ చెంపపై సాయి పల్లవి కొట్టినట్లుగా చెప్పేసింది. సిల్లీగా యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు సాయి పల్లవి ఇచ్చిన సమాధానం అభినందనీయం అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఛానల్ మాత్రమే కాకుండా ఇలాంటి సిల్లీ ప్రశ్నలు చాలా మంది ఈమద్య కాలంలో అడుగుతున్నారు. సెలబ్రెటీలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు ఎదుర్కొని కొందరు తల దించుకుంటే కొందరు మాత్రం సాయి పల్లవిలా గట్టి సమాధానం ఇస్తున్నారు. అందరు సాయి పల్లవిలా సమాధానం చెప్తే ఇలాంటి ప్రశ్నలు మళ్లీ మళ్లీ రావంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: