మెగా మూవీకి కమిట్‌ అయిన కీర్తి సురేష్‌

మహానటి తర్వాత కీర్తి సురేష్‌ జోరు మామూలుగా లేదు. ఆమద్య తెలుగు కంటే తమిళంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన కీర్తి సురేష్‌ టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఇచ్చే పారితోషికంకు ఫిదా అయ్యి వరుసగా తెలుగు సినిమాలను చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ అమ్మడు ఇప్పటికే మహేష్‌ బాబు సర్కారు వారి సినిమాలో నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. నితిన్‌ తో రంగ్‌ దే సినిమాలో నటిస్తుంది. మరో ఇద్దరు యంగ్‌ హీరోలతో కూడా ఈమె నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మూవీలో కూడా నటించబోతుంది.

సుకుమార్‌ నిర్మాణంలో కార్తీక్‌ దన్ను దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది. అధికారికంగా ప్రకటన రావడానికి ముందు రోజే మేము సినిమా విషయాన్ని వెళ్లడించాం. ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని మీ ముందుకు తీసుకు వచ్చాం. సాయి ధరమ్‌ తేజ్‌ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ ను నటింపజేస్తున్నారట. సుకుమార్ కథ అందిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.


Recent Random Post: