ఒక్కో రూపాయి అయినా విరాళం ఇవ్వండి

అందంతో పాటు మంచి మనసున్న అమ్మాయి రష్మి గౌతమ్‌. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తెలుగు లో ఈ అమ్మడు జబర్దస్త్‌ షో చేయడంతో పాటు హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. ఈమె హీరోయిన్ గా త్వరలో సుధీర్‌ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఒక కుక్క కోసం పోస్ట్‌ పెట్టింది.

మూడు మిలియన్‌ ల ఫాలోవర్స్ తన అకౌంట్ లో ఉన్నారు. వారు అందరు కూడా ఒక్కో రూపాయి సాయం చేసినా కూడా ఇటీవల ఆరు అంతస్తుల మేడ మీద నుండి కింద పడ్డ కుక్క కు చికిత్సకు ఉపయోగపడుతుంది. ప్రతి రోజు 300 నుండి 400 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. నా వంతు సాయం అందిస్తున్నాను. మీరు కూడా మీ వంతు సాయం చేస్తే బాగుంటుంది అంటూ రష్మి గౌతమ్ చెప్పుకొచ్చింది. రష్మి గౌతమ్ పిలుపుకు వేలాది మంది స్పందిస్తున్నారు.


Recent Random Post: