అరుదైన మైలు రాయి చేరిన రామ్ చరణ్‌

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ మరో అరుదైన మైలు రాయిని దక్కించుకున్నాడు. సోషల్‌ మీడియాలో ఈయన ఈమద్య కాలంలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో గత కొన్నాళ్లుగా ఉన్న రామ్‌ చరణ్‌ తాజాగా అరుదైన మైలు రాయి దక్కించుకున్నాడు. నాలుగు మిలియన్ ల క్లబ్‌ లో చరణ్ నిలిచాడు. సౌత్‌ నుండి నాలుగు మిలియన్ లు అంతకు మించి ఫాలోవర్స్ ఉన్న హీరోలు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో రామ్‌ చరణ్‌ నిలిచాడు.

రామ్‌ చరణ్ తాజాగా తన తండ్రితో ఉన్న పొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోకు పెద్ద ఎత్తున లైక్స్ మరియు కామెంట్స్ వచ్చాయి. ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈయన వరుసగా పోస్ట్‌ లు చేస్తున్న విషయం తెల్సిందే. దాంతో పెద్ద ఎత్తున ఈయన ఫాలోవర్స్‌ సంఖ్య పెంచుకున్నాడు. ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో పాన్ ఇండియా స్టార్ డం దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంతో అంతా ఉన్నారు. కనుక ఈ సినిమా తో ఆయన మరింతగా ఆయనకు గుర్తింపును తెచ్చి ఫాలోవర్స్‌ సంఖ్య పెంచడం ఖాయం.


Recent Random Post: