బెంగాల్లో అడుగు పెట్టిన ‘అన్నయ్య’.. రజనీ క్రేజీ అప్డేట్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ అన్నాతే (అన్నయ్య). ప్రముఖ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నో అవాంతరాల నడుమ.. ఆగుతూ సాగుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ప్యాచ్ వర్క్ కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి ఫినిష్ చేసేందుకు ఫైనల్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్.

ఇందుకోసం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతా లో ల్యాండ్ అయ్యింది యూనిట్. ఈ షెడ్యూల్ నేటి నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రధాన తారాగణం మొత్తం బెంగాల్లో దిగింది. ఈ మూవీలో ఎంత మంది స్టార్లు నటిస్తున్నారో తెలిసిందే. రజనీతోపాటు జగపతి బాబు ఖుష్బూ నయన తార కీర్తి సురేష్ వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా షూట్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కానీ.. రజనీ పొలిటికల్ ఇష్యూ హైదరాబాద్ లో అనారోగ్యానికి గురవడం వంటి కారణాలతో చాలా డిలే అయ్యింది. ఆ మధ్య షూటింగ్ మళ్లీ మొదలై కొంత కంప్లీట్ చేశారు. ఇటీవల రజనీకాంత్ మళ్లీ అమెరికా వెళ్లొచ్చారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగా వెళ్లొచ్చిన తలైవా.. ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉండడంతో.. షూటింగ్ మొదలు పెట్టేశారు.

ఈ ఫైనల్ షెడ్యూల్ ద్వారా బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొట్టేయాలన్నది యూనిట్ ప్లాన్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద కూర్చోబోతున్నారు. వచ్చే నవంబర్ నాటికి అన్నీ పూర్తిచేసుకొని దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా.. అదే రోజు కమల్ హాసన్ విక్రమ్ కూడా విడుదల చేయాలని చూస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Recent Random Post: