విడాకులు తీసుకోబోతున్నారా?

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన రాజ్‌ కుంద్రా ఇటీవలే బెయిల్‌ పై బయటకు వచ్చాడు. ఆయనకు ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా శిక్ష ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్ కుంద్రా కేసు విషయంలో ఆయన భార్య శిల్ప శెట్టి చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. మీడియాలో ఆమె గురించి కూడా తప్పుడు కథనాలు వచ్చాయి. దాంతో ఆమె చాలా ఫీల్ అయ్యారు అనేది టాక్‌.

భర్త చేసిన పనులకు మరియు ఆయన బిజినెస్‌ లకు తనకు సంబంధం లేదు అని చెబుతున్న శిల్ప శెట్టి మరోసారి తన భర్త విషయంలో స్పందించేందుకు నిరాకరించింది. అసలు ఆయన బెయిల్‌ పై బయటకు వచ్చిన తర్వాత కనీసం కనిపించేందుకు కూడా ఆసక్తిగా లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కూడా మళ్లీ కలుస్తారనే నమ్మకం లేదని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. భర్తకు శిల్పా విడాకులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై శిల్పా నుండి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.


Recent Random Post: