భార్యను వాడుకుని రాజ్‌ కుంద్రా రూ.3 వేల కోట్ల అక్రమార్జన

మొన్నటి వరకు ప్రముఖ వ్యాపారవేత్తగా.. పెద్ద సెలబ్రెటీగా హోదాను అనుభవించిన రాజ్‌ కుంద్రా ఇప్పుడు పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయ్యి ఊచలు లెక్కిస్తున్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనే ఆయనపై చిన్న పెద్ద కేసులు నమోదు అయ్యాయి. అవన్ని ఇప్పుడు బయటకు రావడంతో పాటు కొత్త కేసులు కూడా నమోదు అవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత రామ్‌ కదం చేసిన వ్యాఖ్యలు రాజ్‌ కుంద్రాను మరింతగా ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

రాజ్‌ కుంద్రా ఆన్‌ లైన్ గేమ్ పేరుతో రూ.3 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాడు అంటూ ఆరోపించారు. ఆ సంపాదనకు శిల్పా శెట్టి సహకారం కూడా ఉందని పేర్కొన్నాడు. మూడు వేల కోట్ల రూపాయలను ఆన్ లైన్ గేమ్‌ తో సామాన్య జనాలను మోసం చేసిన రాజ్ కుంద్రా అందుకు గాను భార్య శిల్పా శెట్టిని వినియోగించుకున్నాడు. ఆమె కు ఉన్న స్టార్ డమ్‌ కారణంగా ఆమె ను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వినియోగించాడు. ఆమె అంబాసిడర్ అవ్వడం వల్ల ఆ గేమ్‌ ను జనాలు విపరీతంగా ఆడి మోసపోయారు అంటూ బీజేపీ నేత ఆరోపించాడు. ఈ విషయమై కూడా ఎంక్వౌరీ జరిగే అవకాశం ఉంది.


Recent Random Post: