పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో రఘురామకు ఎంపీ మాధవ్‌ వార్నింగ్‌

దేశ పార్లమెంట్ అంటే అత్యున్నత వేదిక. అలాంటి వేదిక అయిన పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో తనను సహచర ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రంగా దూషిస్తూ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించాడు. ఆయన తనను తీవ్రంగా విమర్శించడం మాత్రమే కాకుండా సీఎం జగన్ గురించి మళ్లీ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నీ అంతు చూస్తాను అన్నట్లుగా హెచ్చరించాడు. ఆయన వ్యాఖ్యలు నన్ను కించ పర్చేవిగా ఉన్నాయంటూ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు.

నన్ను మాధవ్‌ హెచ్చరించిన సమయంలో పక్కన కాంగ్రెస్‌ మరియు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారని.. వారికి కూడా ఆ పరిస్థితి అర్థం అయ్యింది. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్ విజువల్స్ చూసినా కూడా నన్ను గోరంట్ల మాధవ్‌ హెచ్చరించిన విషయం అర్థం అవుతుందని రఘురామ చెప్పుకొచ్చాడు. పార్లమెంట్‌ హాల్‌ లో దూషణలతో వార్నింగ్‌ ఇవ్వడం పట్ల సీరియస్ గా రఘురామ వ్యవహరించబోతున్నాడట. ఆయన పై స్పీకర్‌ కు ఫిర్యాదు చేయడంతో పాటు కచ్చితంగా కఠినంగా ఆయన్ను శిక్షించేలా కార్యచరణ తో ముందుకు వెళ్తానంటూ చెప్పుకొచ్చాడు.


Recent Random Post: