‘రాధే శ్యామ్’ కు భారీ ఓటీటీ ఆఫర్.. నిర్మాతలు టెంప్ట్ అవుతారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధే శ్యామ్”. 1960ల నాటి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ డ్రామాగా రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. హిందీలో టీ-సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 రోజుల మాత్రమే మిగిలివుందని తెలుస్తోంది. షూటింగ్ లకు అనుమతి వచ్చిన వెంటనే పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు.

ఇకపోతే ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన సమయానికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అసాధ్యమనే చెప్పాలి. అయితే ప్రభాస్ సినిమా కోసం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

‘రాధే శ్యామ్’ సినిమాకి దాదాపు రూ. 400 కోట్ల భారీ డీల్ ఆఫర్ చేస్తున్నట్లు ఓటీటీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై టీ సిరీస్ – యూవీ క్రియేషన్స్ వారితో చర్చలు జరుగుతున్నాయట. గతంలో కూడా 300 కోట్ల ఆఫర్ తో వచ్చిన ఓటీటీ డీల్ ని మేకర్స్ రిజెక్ట్ చేశారు. ‘రాధే శ్యామ్’ చిత్రానికి 300 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నట్లు టాక్. మరి ఇప్పుడు అమెజాన్ వారు చెప్తున్న ప్రైజ్ నిజమే అయితే లాభసాటి భేరమనే అనుకోవాలి. మరి నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కోసం చూస్తారా లేదా ఓటీటీ ఆఫర్ కి టెంప్ట్ అవుతారా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.


Recent Random Post: