పుట్ట మధు విచారణలో కదులుతున్న డొంక

టీఆర్‌ఎస్‌ నాయకుడు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఆయన కోసం వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు పుట్ట మధు చేసిన తప్పేంటీ, ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు అనేది చర్చనీయాంశంగా మారింది. పుట్టా మధును భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకు వచ్చి ఎంక్వౌరీ చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న అక్రమాల గురించి పోలీసుల విచారణలో బయట పడుతున్నట్లుగా తెలుస్తోంది. మధుతో పాటు ఇంకా పలువురు వ్యాపారులు కూడా ఈ విషయంలో బయట పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసుల నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. విచారణ పూర్తి అయిన తర్వాత పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల వారు పుట్ట మధు విషయమై అధికారికంగా మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పే అవకాశం ఉంది.


Recent Random Post: