షూటింగ్ కు బయలుజేరుతూ ఏడ్చిందట

బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను కూడా చేస్తూ వెబ్ సిరీస్ లు షో లతో బిజీగా ఉండే ప్రియాంక చోప్రా కరోనా వల్ల దాదాపుగా ఏడాది కాలం పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్ లకు వెళ్లకుండా కేవలం ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలను చూసుకుంటూ ఇన్నాళ్లు గడిపిన ప్రియాంక చోప్పా ఎట్టకేలకు ఒక వెబ్ సిరీస్ కోసం షూటింగ్ కు హాజరు అయ్యింది. షూటింగ్ కోసం ప్రియాంక చోప్రా జర్మనీ వెళ్లింది. జర్మనీ వెళ్లే సమయంలో ఆమె భయంతో కన్నీరు పెట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.

ఆరు నెలల పాటు షూటింగ్ లు లేకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి.. ఇంట్లో వారితో చాలా సేఫ్ గా హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు ఈ పాండమిక్ సమయంలో మళ్లీ షూటింగ్ అంటే మొదటే భయం వేసింది. అయినా తప్పక పోవడంతో జర్మనీ షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ కు వెళ్లాలి అన్నప్పుడే టెన్షన్ మొదలు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కూల్ గా ఉంటూ వచ్చిన ప్రియాంక చోప్రా షూటింగ్ కోసం జర్మనీ విమానం ఎక్కిన సమయంలో భయంతో కన్నీరు పెట్టుకుందట.

ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఆమెకు కన్నీరు తెప్పించిందట. చాలా భయం వేసింది.. ఏం చేయాలో తెలియక కన్నీరు పెట్టుకున్న నేను ఆ తర్వాత షూటింగ్ ను సాఫీగానే చేసినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముగించినట్లుగా చెప్పింది. ఆ తర్వాత వరుసగా షూటింగ్ లతో ఈమె బిజీ అయ్యింది. గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని బిగ్గెస్ట్ భారీ చిత్రాలను చేస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. నిక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈమె కెరీర్ ఏమాత్రం డల్ అవ్వలేదు. జోరుగా సాగుతూనే ఉంది.


Recent Random Post: