మళ్లీ ట్వీట్‌ తో సస్పెన్స్ లో పెట్టిన పూనమ్‌ కౌర్‌

తెలుగు లో హీరోయిన్‌ గా పలు సినిమాల్లో నటించి ఈమద్య కాలంలో కనిపించకుండా పోయిన పూనమ్‌ కౌర్‌ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో అర్థం కాకుండా పోస్ట్‌ లు పెడుతుంది. ఆ తర్వాత వాటిని డిలీజ్ చేయడం చేస్తుంది. కొన్ని సార్లు డిలీట్ చేయకుండా అలాగే ఉంచుతుంది. తాజాగా మరోసారి ఆమె చేసిన రెండు ట్వీట్స్ ను అర్థం చేసుకునేందుకు మీడియా వారు.. ఇండస్ట్రీ వర్గాల వారు జుట్టు పీక్కుంటున్నారు. ఈసారి ఆమె దాసరి ని గుర్తు చేసుకుంటూ ఈ ట్వీట్‌ ను చేసింది.

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన రౌడీ దర్బార్ సినిమాలోని ఇంద్రలోకం పార్టీ.. చంద్ర లోకం పార్టీ అనే పాటను షేర్‌ చేసింది. ఆ పాటను తప్పకుండా వినాలంటూ ఆమె సూచించింది. ఆతర్వాత మరో ట్వీట్‌ ను చేసింది. అందులో చిత్ర పరిశ్రమకు ఏకైక గురువు దాసరి గారు. ఆయన నాకు తండ్రిలాంటి వారు. ఆయన్ను మిస్ అవుతున్నాను. నేను ఆయనకు ఈ సమయంలో ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అంటూ గురు ను ప్రత్యేకంగా హ్యాష్ ట్యాగ్‌ పెట్టింది. ఈ ట్వీట్‌ ఆ ఇద్దరిని ఉద్దేశించి అన్నదే అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు ఈమెకు మతి తప్పినట్లుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Recent Random Post: