కత్తి మహేష్‌ మృతిపై పూనమ్‌ కామెంట్స్‌

యాక్సిడెంట్ తో గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్‌ తుది శ్వాస విడిచాడు. ఆయనకు అయిన గాయాల కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆయన మృతి పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సోషల్‌ మీడియాలో పాజిటివ్ గా రెస్పాన్స్‌ అవుతుంటే కొందరు మాత్రం ఇండైరెక్ట్‌ గా కామెంట్స్‌ చేస్తున్నారు. హిందువుల్లో మెజార్టీ శాతం వారు రాముడిని సీతమ్మను విమర్శించి పాపం చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయంలో హీరోయిన్‌ పూనమ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నా తప్పు లేకున్నా నేను రోజూ చస్తూ బతికాను. నా మనసుకు ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఇలా ఉన్నాను అని అనిపిస్తుంది. ఇన్ని రోజులు నాకు అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఒక రాజకీయ పార్టీ తమ అవసరం కోసం బలవంతంగా ఒక దళితుడిని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఇకపై ఎప్పుడు ఆ పేరు కూడా ప్రస్థావించను అంటూ షేర్‌ చేసింది. గతంలో కత్తి మహేష్‌ మరియు పూనమ్‌ కౌర్‌ ల మద్య తీవ్ర మాటల యుద్దం జరిగింది. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో కూడా ఆమె స్పందించిన విషయం అందరికి తెల్సిందే.


Recent Random Post: