ఏలూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు ఆర్ధికసాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మాజీగూడెంకు చెందిన కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందించారు. పేదవేగి మండలం విజయరాయిలో మల్లికార్జున కుటుంబాన్ని, జానంపేటకు చెందని మరో రైతు కటుంబాన్ని కలిసి పరామర్శించారు.

అనంతరం వారికి లక్ష చొప్పున ఆర్ధికసాయం చెక్కు రూపంలో అందించారు. మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 41 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధికసాయం అందించనున్నారు. వీరిలో పెదవేగి, లింగపాలెం మండలాల్లోని గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. అనంతరం జరిగే రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. అంతకుముందు పవన్ కల్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈక్రమంలో కలపర్రు టోల్ గేట్ ప్రాంతంలో పవన్ అభిమానులు ఉన్న వాహనాన్ని లారీ ఢీకొంది. ఎవరికీ గాయాలు కాలేదు. దుగ్గిరాల వద్ద పవన్ అభిమాని బైక్ ను కారు ఢీకొంది. గాయాలైన అభిమానిని ఆసుపత్రికి తరలించారు.


Recent Random Post: