నితిన్ మరో సినిమా కన్ఫర్మ్‌

కరోనా సమయంలోనూ యంగ్‌ హీరో నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది భీష్మ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్‌ హీరో ఈ ఏడాది ఇప్పటికే చెక్‌ మరియు రంగ్‌ దే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఈ ఏడాది మ్యాస్ట్రో సినిమాను కూడా నితిన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక పవర్ పేట సినిమాను కూడా నితిన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు మరో సినిమాను కూడా నితిన్ కన్ఫర్మ్‌ చేశాడు.

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ నాపేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ వక్కంతం వంశీకి ఆఫర్‌ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఆయనకు నితిన్‌ నుండి పిలుపు వచ్చింది. ఠాగూర్‌ మధు నిర్మాణంలో నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. మ్యాస్ట్రో సినిమా పూర్తి అయిన వెంటనే వక్కంతం వంశీ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. త్వరలో అధికారికంగా ఠాగూర్‌ మధు ఈ సినిమా గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.


Recent Random Post: