మూడు సినిమాలు డిజిటల్ రిలీజ్ వైపు

మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్ళింది. థియేటర్లు మూతపడి రెండు నెలలు కావొస్తోంది. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ ల వైపు మొగ్గు చూపుతున్నాయి. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేద్దామనుకున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

అందుకని టాలీవుడ్ లో కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ లకే ఓటు వేస్తున్నాయి. ఇప్పటికే దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకుంది. త్వరలోనే విడుదల గురించి ప్రకటన వస్తుంది. మరోవైపు నితిన్ నటించిన మేస్ట్రో చిత్రం కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో దీని రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది.

ఇక విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న పాగల్ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతున్నట్లు, త్వరలోనే నిర్ణయం వెలిబుచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


Recent Random Post: