నితిన్ రంగ్ దే ఓటిటిలో వచ్చేది అప్పుడే!

యంగ్ హీరో నితిన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. డీసెంట్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ పెర్ఫార్మన్స్ ను మాత్రమే తెచ్చుకోగలిగింది. కోవిడ్ భయాల నడుమ రంగ్ దే సినిమా అనుకున్న రేంజ్ ను అందుకోలేదు.

ఇక సినిమా విడుదలై ఇన్ని వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. జీ5 చిత్రం రంగ్ దే చిత్ర డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం జూన్ 12 నుండి రంగ్ దే జీ5 ఓటిటి సంస్థలో స్ట్రీమ్ అవుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకున్న రంగ్ దే ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.


Recent Random Post: