రూ.25 లక్షల నుండి కోటికి చేరిన జాతిరత్నం

ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా సక్సస్‌ అయినా కూడా నవీన్‌ పొలిశెట్టిని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన్ను అలా వచ్చి ఇలా వెళ్లే నటుడు అనుకున్నారు. కాని జాతిరత్నాలు సినిమా తర్వాత ఇండస్ట్రీలో పాతుకు పోయే క్వాలిటీస్ తో పాటు కెపాసిటీ ఉన్న నటుడు అంటూ నవీన్‌ పొలిశెట్టిపై ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు స్టార్‌ హీరోగా మంచి గుర్తింపును నవీన్‌ తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు. ఇక నవీన్ తనకు వచ్చిన డిమాండ్‌ తో పారితోషికంను భారీగా పెంచేశాడు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జాతిరత్నాలు సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం రూ.25 లక్షల రూపాయలుగా సమాచారం అందుతోంది. కాని ఇప్పుడు ఆయనతో సినిమాకు పలువురు నిర్మాతలు కోటి పారితోషికంతో సిద్దంగా ఉన్నారు. ఆయన డిమాండ్‌ చేయాలే కాని అంతకు మించి కూడా ఇస్తామంటున్నారు. ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. మహేష్‌ బాబు నిర్మాణంలో ఒక సినిమాను నవీన్‌ పొలిశెట్టి చేసే అవకాశం ఉందంటున్నారు. కోటి రూపాయల పారితోషికంను నవీన్‌ కు మహేష్‌ ఇవ్వబోతున్నాడని కూడ ఆ చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.


Recent Random Post: