వెంకీ సినిమాల నిర్ణయంపై ఫ్యాన్స్ లో అసంతృప్తి

కరోనా మహమ్మారి అన్ని ఇండస్ట్రీలను ఆర్ధికంగా దారుణంగా కుదిపేసింది. సినిమా ఇండస్ట్రీ కూడా వేల కోట్లలో నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా కానీ నిర్మాతలు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసే సాహసం చెయ్యట్లేదు. అసలు థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి ఇప్పట్లో రాదేమో.

ఇందుకోసమే కొంత మంది నిర్మాతలు ఇష్టం లేకపోయినా ఓటిటి సంస్థలకు తమ సినిమాలను అమ్మేసుకుంటున్నారు. అగ్ర నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు దృశ్యం 2, నారప్పలను ఓటిటి సంస్థలకు అమ్మేశాడు.

దీనిపై వెంకటేష్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసారు. తమ అభిమాన హీరో సినిమా ఇలా థియేటర్లలో విడుదల కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సురేష్ బాబును తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చే వరకూ వేచి చూడాలని కోరుతున్నారు.


Recent Random Post: