లవ్ స్టోరీ నుండి థాంక్యూకు మూవ్ అయిన చైతన్య

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం సజావుగా సాగిపోతోంది. ఈ హీరో గతేడాది రెండు వరస హిట్స్ ను అందుకున్నాడు. ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీను పూర్తి చేసాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఏదైతేనేం మొత్తానికి ఈ నెలలోనే లవ్ స్టోరీ షూటింగ్ మొత్తం పూర్తయింది. సాయి పల్లవి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

ఇక లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య థాంక్యూ చిత్రాన్ని చేస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. థాంక్యూ చిత్ర షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి కథను అందించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికలుగా నటిస్తారని అంటున్నారు. థాంక్యూ గురించిన మరింత సమాచారం త్వరలో బయటకు రానుంది.


Recent Random Post: