ప్రభాస్ మూవీ గురించి నాగ్‌ అశ్విన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

మహానటి వంటి బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ సినిమాను చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ తదుపరి చేయబోతున్న సినిమా ప్రభాస్ తో అనే విషయం తెల్సిందే. దాదాపు ఏడాది క్రితం ప్రకటన వచ్చిన ఈ సినిమా ఇంకా పట్టాలు ఎక్కక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినిమా పై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. నాగ్‌ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు సినిమా విడుదల నేపథ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మూవీ గురించి స్పందించాడు.

ప్రభాస్ తో చేయబోతున్న సినిమా లోని ప్రతి ఎలిమెంట్‌ ను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. మహానటి వంటి సినిమా లో పాత కార్లు కావాలంటే కాస్త ఎక్కువ రేటు పెడితే ఎక్కడైనా లభిస్తాయి. కాని ప్రభాస్ సినిమా లో అలా కాదు. చిన్న ఎలిమెంట్‌ నుండి పెద్ద ఎలిమెంట్‌ వరకు అన్నింటిని సొంతంగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. జులై నుండి సినిమా షూటింగ్‌ ను ప్రారంభిస్తామని ప్రకటించాడు. నాగ్‌ అశ్విన్‌ ప్రకటన నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: