దేశాభివృద్ధి కోసం కేసీఆర్ భారత ప్రధాని కావాలి: మంత్రి మల్లారెడ్డి

కేసీఆర్ ఒక్కసారి ప్రధాని అయితే.. తెలంగాణ లో జరిగిన అభివృద్ధే దేశంలోనూ జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక, ఉపాధి కల్పన పద్దుపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి విశేష కృషి జరుగుతోందని అన్నారు. ప్రైవేటీకరణతో బీజేపీ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశ ముఖచిత్రమే మారిపోతుందని అన్నారు.


Recent Random Post: