జగన్ ను గుర్తు చేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వం లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ వినోదాత్మకంగా పోకిరి మరియు దూకుడు సినిమాల మిక్సింగ్ అన్నట్లుగా సర్కారు వారి పాట ఉండబోతుందని మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్‌ ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.

అమ్మాయిలు మరియు అప్పు గురించి చెప్పిన డైలాగ్ తో పాటు కీర్తి సురేష్ పదివేల డాలర్లు అప్పుగా ఇస్తే ఫీజు కట్టి మంచిగా చదివి పేరు తెచ్చుకుంటాను అంటూ క్యూట్ గా చెప్పిన సమయంలో మహేష్బాబు అంతకు మించి ఫన్నీగా వైఎస్‌ జగన్‌ నోట ఎక్కువ సార్లు వచ్చిన డైలాగ్‌.. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ కీర్తి సురేష్ కి చెప్పి భరోసా కల్పిస్తూ ఉన్నట్లుగా చేతిలో డబ్బులు పెట్టిన సన్నివేశం ట్రైలర్ లో బాగా ఆకట్టుకుంటుంది. వైఎస్ జగన్‌ ఆ డైలాగ్‌ తో బాగా పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు ఆ డైలాగ్‌ వాడటంతో వైరల్‌ అయ్యింది. మొత్తానికి సినిమాపై అంచనాలు పెంచే విధంగా సర్కారు వారి పాట ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెడ్డింగ్‌ లో ఉంది. రికార్డు స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.


Recent Random Post: