మహేష్ జక్కన్న మల్టీస్టారర్.. కాని చిన్న ట్విస్ట్

మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఎప్పుడో చేయాల్సి ఉంది. కాని ఏదో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. బాహుబలి తర్వాత మహేష్ బాబుతోనే రాజమౌళి ప్లాన్ చేశాడు.

కాని ఆ సమయంలో వీలు పడలేదు. కథ మల్టీ స్టారర్ ను డిమాండ్ చేయడం వల్ల ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ ను తెరకెక్కించాడు. ఇప్పటికే లేట్ అయిన మహేష్ బాబు ప్రాజెక్ట్ ను ఇంకా ఆలస్యం చేయాలని జక్కన్న భావించడం లేదు.

అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయిన వెంటనే రాజమౌళి తదుపరి సినిమా ను మహేష్ బాబు హీరోగా ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబో విషయం పై ఇప్పటికే పలు సందర్బాల్లో పలు వేదికలపై అధికారికంగా ప్రకటనలు వచ్చాయి.

ఇప్పుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్దం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ అందించే కథ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్లుగా.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఆయన అభిమానులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాగే మహేష్ బాబును చూపించేందుకు విజయేంద్ర ప్రసాద్ పలు స్టోరీ లైన్స్ ను సిద్దం చేయడం అందులో నుండి రాజమౌళి ఒక స్టోరీ లైన్ ను పిక్ చేసుకోవడం జరిగిందట. మహేష్ బాబుకు కూడా ఆ లైన్ నచ్చడంతో ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ మరియు జక్కన్న కజిన్ ఆ స్టోరీ లైన్ పై వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబో మూవీ లో మరో హీరో కూడా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

కాని సినిమాలో ఒక అర్థ గంట పాటు ఆ హీరో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా గురించి ఒక్కటి అంటే ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. కాని ఎన్నో పుకార్లు మాత్రం షికారు చేస్తూనే ఉన్నాయి.

మహేష్ బాబు రాజమౌళి సినిమా లో మరో హీరో అయితే నటించబోతున్నాడు కాని ఇద్దరు హీరోల కాంబోలో కనీసం ఒక్క నిమిషం సన్నివేశం కూడా ఉండబోతదట.

అంటే ఇద్దరు హీరోలు కూడా వేరు వేరు కాలాల్లో ఉండే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా లో మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ఒక స్టార్ హీరో పాత్రను నటింపజేస్తున్నారేమో అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


Recent Random Post: