అఫిషియల్‌ : సర్కారు వారి పాట సంక్రాంతికి రావడం లేదు

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఈ ఏడాది ఆరంభం నుండి చెబుతూ వస్తున్నారు. కాని ఇప్పుడు సినిమా విడుదల తేదీ మార్చుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. నేడు సాయంత్రం సమయంలో సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. దాంతో సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి లేదు అని దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

గత ఏడాది సంక్రాంతికి సరి లేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్‌ బాబు ఈ ఏడాది మళ్లీ సినిమా ను విడుదల చేయలేక పోయాడు. కరోనా వల్ల గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు మహేష్ బాబు సినిమా రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా వస్తుందని ఆశ పడితే అది కూడా లేదు అంటూ తేల్చి చెప్పారు. దాంతో సర్కారు వారి పాట కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల వాయిదాకు ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల కారణం అంటూ చాలా మంది అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది చూడాలి.


Recent Random Post: