ఆదిపురుష్‌ సీత మహానటినే!

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్‌ హీరోయిన్‌ విషయమై గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట్లో కీర్తి సురేష్ ను ఈ సినిమాలో సీత పాత్రకు నటింపజేసేందుకు చర్చలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కృతి శెట్టి ని హీరోయన్ గా నటింపజేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. కాని త్వరలో షూటింగ్‌ లో కీర్తి సురేష్ జాయిన్ అవ్వబోతుంది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కీర్తి సురేష్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబయి వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ప్రభాస్‌ మరియు కీర్తి సురేష్ జంట ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని పాన్ ఇండియా మూవీ అంటే కీర్తి సురేష్‌ ఖచ్చితంగా ప్లస్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్‌ తో పాటు ఉత్తరాదిన కూడా మహానటి సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు సీత పాత్రతో మెప్పిస్తుందేమో చూడాలి.


Recent Random Post: