సుశాంత్‌ని హత్య చేసిన హంతకుడు వాడే

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్‌లు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతా స్థంభించడంతో ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ లు పెడుతుంది. ఇలాంటి సమయంలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య చాలా తగ్గింది. దాంతో ఆమె ఒక వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసింది. అతడు దుర్మార్ఘుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి జీవితంలో ఒక్క అమ్మాయి ఉండదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. అతడే సుశాంత్‌ హత్యకు కూడా కారనం అంది. ఆ పనికిమాలిని వాడు తనకు లవర్ అని కూడా కంగనా పేర్కొంది.

తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య తగ్గించేందుకు ఎంతగా ఖర్చు చేస్తున్నారో నాకు తెలుసు. నాపై మీమ్స్ కు ట్రోల్స్ కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న విషయం కూడా నాకు తెలుసు. వాడి సంగతి త్వరలో చెప్తాను. త్వరలో నా టీమ్ నా సోషల్ మీడియాల ఖాతాలకు ఏం జరుగుతుంది, నాపై ఎలాంటి కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని గుర్తిస్తారని, ఆ సమయంలో వాడి బాగోతం అంతా బయట పెడుతాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా చేసిన ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


Recent Random Post: