కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారు..! సినీ నటుడి ఆవేదన

సినిమాల్లో భరతనాట్యంను తప్పుగా చిత్రీకరించి ఆ కళకు కమల్ హాసన్, అజిత్ ద్రోహం చేశారని నటుడు, దర్శక, నిర్మాత సాయి శ్రీరామ్‌ సంచలన ఆరోపణలు చేశారు. భరతనాట్యం నేపథ్యంలో ‘కుమారసంభవం’ అనే సినిమాను తెరకెక్కించారు. కథ, కథనం, సంగీతం, మాటలు, నృత్యం, పాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్మాత, హీరోగా కూడా నటించడం విశేషం. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘కొన్నేళ్లుగా భరతనాట్యంను కించపరుస్తూ సినిమాలు చిత్రీకరిస్తున్నారు. వరలారు చిత్రంలో నటుడు అజిత్‌ భరతనాట్యం నేర్చుకోవడం వల్లే తనకు వివాహం కాలేదని చూపించారు. తాను భరతనాట్య కళాకారుడు కావడం వల్లే తన భార్య వదిలి వెళ్లిపోయినట్లుగా కమల్ హాసన్ చిత్రీకరించారు. భరతనాట్య కళాకారుడిని పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రారనే తప్పుడు సంకేతాలను చిత్రాల ద్వారా కల్పిస్తున్నారు. అలాంటి అపోహలను పోగొట్టడానికే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను’ అని తెలిపారు.


Recent Random Post: