కాజల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. అదే నిజమైతే తట్టుకోలేరు!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. అలాగే తన మాతృత్వ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫాలోవర్స్తో పంచుకుంటోంది. ఇకపోతే తెలుగులో ఈమె చివరిగా నటించిన చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి అవినాష్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించారు. అలాగే ఇందులో చిరంజీవి సరసన కాజల్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. గత ఏడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ మెగా మల్టీస్టారర్ పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో కాజల్ ను ఒక్క షాట్ లో కూడా చూపించకపోవడంతో.. ఆమె పాత్రకు ప్రాధన్యత ఉండదనే టాక్ మొదలైంది.

దాంతో ఈ విషయాన్ని ఆమె అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. అయితే తాజాగా కాజల్ ఫ్యాన్స్ ను కలవర పెట్టే మరో బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఆచార్యలో కాజల్ కి సంబంధించిన చాలా ఎపిసోడ్స్ ను కొరటాల కట్ చేసేశారట. ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం ఆమె ఫినిష్ చేయలేదని.. అందు కారణంగానే ఆమె సన్నివేశాలను తొలగించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పైగా తన సినిమాలకు సంబంధించి ప్రతి అప్డేట్ ను సోషల్ మీడియాలో పంచుకునే కాజల్.. ఆచార్య ట్రైలర్ ను మాత్రం ప్రమోట్ చేయలేదు. దాంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమే అని చాలా మంది నమ్ముతున్నారు. మరి ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే.. ఆచార్యపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాజల్ అభిమానులు ఏ మాత్రం తట్టుకోలేరు.


Recent Random Post: