నా కుటుంబాన్ని రేప్ చేసి చంపేస్తామంటున్నారు: హీరో సిద్దార్ధ్

తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నాయని హీరో సిద్ధార్ధ్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం కలకలం రేపుతోంది. సిద్ధార్ద్ ఇటివల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమకాలీన రాజకీయాలు, వ్యవస్థలపై ట్వీట్లు చేస్తున్నాడు. ఈమేరకు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

‘నా ఫోన్ నెంబర్ ను తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ లీక్ చేసింది. వాళ్లు నన్ను టార్గెట్ చేశారు. 24 గంటల్లోనే తన ఫోన్ కు 500 కాల్స్ వచ్చాయి. నా కుటుంబాన్ని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. అన్ని నెంబర్లు రికార్డు చేశాను. బీజేపీ లింకులు, డీపీతో సహా పోలీసులకు ఇస్తున్నాను. నేను నోరు మూసుకుని కూర్చోను. పోరాడుతూ ఉంటాను’ అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ను ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశాడు. ఇటివల బీజేపీపై, తమిళనాడు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ట్వీట్లు చేస్తూ విమర్శిస్తున్నాడు సిద్దార్ధ్.


Recent Random Post: