నీ రాజకీయాలు ఏపీలో చూపించుకో..! జేసీ వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం..!

సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ సోనియా, రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జేసీ రాజకీయాలు ఆంధ్రాలో జగన్ పై చూసుకోవాలని అన్నారు. కేసీఆర్ కోవర్ట్ లా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. నీ రాజకీయాల్ని రాయలసీమలో చూపాలని వార్నింగ్ ఇచ్చారు.

‘తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఏడుస్తూ కూర్చుంటే కాదు.. వేరే దారి చూసుకోవడం బెటర్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అక్కడా ఇక్కడా లేకుండా పోయింది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లింది. సాగర్‌లో జానారెడ్డి గెలువలేడు’ అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో జేసీ వ్యాఖ్యల్ని ఖండించని భట్టి, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి‌పై అధిష్టానానికి కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి.


Recent Random Post: