‘దర్శకరత్న’ పేరుతో దాసరి బయోపిక్..! దర్శకుడు, నిర్మాత ఎవరంటే..

తెలుగు సినిమా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు బయోపిక్ తెరకెక్కనుంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో ‘దర్శకరత్న’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కనుంది. దాసరి పాత్రలో ప్రముఖ హీరో పోషించనున్నారని తెలుస్తోంది. ఈమేరకు ఇమేజ్ ఫిల్మ్స్ బ్యానర్ అధినేత తాడివాక రమేష్ వివరాలు వెల్లడించారు.

‘దాసరిపై ‘దర్శకరత్న’ పేరుతో బయోపిక్ నిర్మిస్తున్నా. దాసరికి అత్యంత సన్నిహితులు, ప్రముఖ దర్శకులు ధవళ సత్యం దర్శకత్వం వహిస్తారు. ధవళ సత్యం గారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చింది. పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం. దాసరి స్మారకార్ధం ‘దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్ కూడా ప్రదానం చేస్తాం. ‘దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్’ ద్వారా వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తాం’ అని అన్నారు.


Recent Random Post: