దాసరి అరుణ్‌ పై అట్రాసిటీ కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తనయుడు అరుణ్‌ కుమార్ పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బొల్లారంకు చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ గతంలో దాసరి నారాయణ రావు వద్ద పని చేశారు. ఆయన మరణం తర్వాత ఆయన కొడుకుల వద్ద పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన డబ్బును ఇవ్వాలంటూ దాసరి అరుణ్‌ కుమార్‌ ను నర్సింహులు వెంకటేష్‌ అడిగాడు. అందుకు నో చెప్పిన అరుణ్‌ అసలు ఒప్పందంలో తాను సంతకం చేయలేదు అంటూ తేల్చి చెప్పేశాడు.

ఆ సమయంలో జరిగిన ఘటనలో నర్సింహులును దాసరి అరుణ్‌ కుమార్‌ సామాజిక వర్గం పేరుతో దూషించాడు. కులం పేరును అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడట. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన నర్సింహులు వెంకటేష్‌ కేసు పెట్టాడు. ఈనెల 13వ తారీకున ఈ సంఘటన జరిగింది. ఫిల్మ్‌ నగర్ లోని ఎఫ్‌ ఎన్‌ సీసీ లో జరిగిన చర్చల సందర్బంగా దాసరి అరుణ్‌ తనను కులం పేరుతో దూషించాడు అంటూ కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.


Recent Random Post: