మెగాస్టార్‌ ను కలిసిన మహేష్‌ డైరెక్టర్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో మహర్షి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మరోసారి ఆయనతో వర్క్‌ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. మూడేళ్లుగా వంశీ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టింది లేదు. తాజాగా ఈ దర్శకుడు మెగాస్టార్‌ చిరంజీవిని కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. కనుక ఈ సినిమాను కూడా ఓకే చేసే అవకాశం ఉందంటున్నారు. వంశీ చెప్పిన కథ కు ఆయన దాదాపుగా ఓకే చెప్పినట్లుగానే మెగా కాంపౌండ్‌ నుండి వార్తలు వస్తున్నాయి. కాని మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కమిట్‌ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి చేసేందుకు కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది వరకు వంశీ వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. ఇప్పటికే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటిది మళ్లీ వెయిట్‌ అంటే వంశీ అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాని చిరంజీవితో వంశీ సినిమా అంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.


Recent Random Post: