మెగాస్టార్‌ కోసం బాలీవుడ్ బ్యూటీతో బాబీ చర్చలు

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి అయిన తర్వాత చేసేందుకు మూడు సినిమాలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. ఆచార్య తర్వాత మూడు నాలుగు నెలలకు ఒకటి చొప్పున చాలా స్పీడ్ గా సినిమాలను పూర్తి చేసే ఉద్దేశ్యంతో మెగాస్టార్‌ చిరంజీవి ఉన్నాడు. ఆచార్య పూర్తి అయిన వెంటనే లూసీఫర్‌ రీమేక్ ను పట్టాలెక్కించబోతున్నాడు. మూడు నెలల్లోనే ఆ సినిమాను పూర్తి చేసి వేదాళంను మొదలు పెట్టబోతున్నాడు. ఇదే సమయంలో బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చిరంజీవి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు, అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరియు బాబీల కాంబోలో రూపొందబోతున్న సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించబోతుందట. ప్రస్తుతం సినిమా కోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈమద్య కాలంలో ఆమెకు బాలీవుడ్‌ లో పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు. కనుక ఆమెను తెలుగులో నటింపజేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. మైత్రి మూవీ మేకర్స్‌ వారు సోనాక్షికి భారీ పారితోషికం ఆఫర్‌ చేసి నటింపజేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


Recent Random Post: