బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన ఛార్మి

హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఛార్మి ప్రస్తుతం సహ నిర్మాతగా పూరి సినిమాలకు వ్యవహరిస్తుంది. ప్రస్తుతం లైగర్ సినిమాకు ఈమె కో ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండా పలు విభాగాల్లో ఆమె ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుందని అంటున్నారు. ప్రొడక్షన్‌ మరియు డైరెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌ కు సంబంధించి అన్ని విధాలుగా తాను లైగర్ సినిమా మేకింగ్ లో పాల్గొంటుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్ లు పెట్టే ఈమె ఈసారి మాత్రం కాస్త బ్రేక్‌ తీసుకుంటుందట. సోషల్‌ మీడియాకు చిన్న బ్రేక్‌ తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ వస్తాను అంటూ పేర్కొంది. ఛార్మి సోషల్‌ మీడియాకు ఎందుకు బ్రేక్‌ తీసుకుంటుంది అనే విషయంలో స్పష్టత లేదు. కాని ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ అయితే జరుగుతోంది. ఛార్మి ఎందుకు సోషల్‌ మీడియాకు బ్రేక్ తీసుకుంది అనే విషయాన్ని ఆమె అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఆమె నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


Recent Random Post: