చంద్రబాబుకి కుప్పంలో షాక్..! ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాంటూ జెండా

కొన్నాళ్లుగా టీడీపీలోకి ఎన్టీఆర్ ను తీసుకురావాలనే డిమాండ్లు ఊపందుకున్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 2024 సీఎం జూనియర్ ఎన్టీఆర్ అనే ఫ్లెక్లీ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికల అనంతరం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు కూడా కార్యకర్తల నుంచి ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకురావాలనే డిమాండ్ ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే కుప్పంలోనే చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చే సంఘటన జరిగింది.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన ఫ్యాన్స్ ఏకంగా ఓ జెండానే ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో ఈ బ్యానర్ వెలిసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఈ జెండా ఆవిష్కరించినట్టు తెలుస్తోంది. అయితే.. టీడీపీ నాయకులెవరూ ఈ అంశంపై స్పందించడం లేదు. చంద్రబాబు రోడో షోలో ఆయనకే ఎదరైన డిమాండ్ ఆయనకు షాకిస్తే.. ఈ బ్యానర్ తో మరోసారి చంద్రబాబుకి షాకిచ్చారు. మరి.. టీడీపీ స్పందనేంటో..!


Recent Random Post: