సంక్రాంతి మూవీ నెం.4

మార్చిలో ఆగిపోయిన సినిమా రిలీజ్‌ లు మెల్ల మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటి వరకు కాస్త ఫేమ్‌ ఉన్న హీరోల సినిమాలు విడుదల కాలేదు. క్రిస్మస్ కానుకగా సాయి ధరమ్‌ తేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా కారణంగా ఇంకా థియేటర్లు పూర్తిగా తెరిచే పరిస్థితి లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులు వచ్చాయి. ఇలాంటి సమయంలో సినిమాలు విడుదల అంటే చాలా పెద్ద సహసమే. కాని ఓటీటీకి వెళ్లే బదులు ఇలా వచ్చి లాభమో నష్టమో విడుదల అయ్యిందనిపించుకుంటే బాగుంటుంది కదా అని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. సంక్రాంతికి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలు అధికారికంగా ప్రకటన వచ్చాయి.

సంక్రాంతికి ప్రధానంగా రాబోతున్న మూవీ రవితేజ నటించిన ‘క్రాక్‌’ మరియు రామ్ నటించిన ‘రెడ్‌’. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ ‘మాస్టర్‌’ కూడా రాబోతుంది. ఇక ఈ మూడు సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో తాను ఉన్నాను అంటూ బంగారు బుల్లోడు ప్రకటించాడు. అల్లరి నరేష్‌ హీరోగా పూజా జవేరి హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుందని జనవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా సోషల్ మీడియా ద్వారా నిర్మాత ప్రకటించారు.


Recent Random Post: