అనుష్క కొత్త సినిమా అప్‌డేట్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి నిశబ్దం సినిమా తర్వాత కొత్త సినిమాలను అధికారికంగా ప్రకటించింది లేదు. నిశబ్దం సినిమా కు కూడా అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. మళ్లీ అదే తరహాలో తదుపరి సినిమాకు గ్యాప్‌ తీసుకుంటుందా అంటూ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభాస్ హోం బ్యానర్ గా పేరున్న యూవీ క్రియేషన్స్ లో అనుష్క సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

రారా కృష్ణయ్య సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పి మహేష్‌ దర్శకత్వంలో అనుష్క మూవీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయమై అధికారికంగా ఎలాంటి అప్ డేట్‌ రాలేదు. కాని తాజాగా యూవీ క్రియేషన్స్‌ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సినిమా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్ గా కాస్త బోల్డ్‌ కంటెంట్ తో ఉంటుందని అంటున్నారు. న్యూ ఏజ్‌ ఎంటర్ టైనర్‌ గా అనుష్క మూవీని మహేష్‌ రూపొందించబోతున్నాడు అంటున్నారు. త్వరలోనే అధికారికంగా సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక యంగ్‌ హీరో నటిస్తాడని సమాచారం.


Recent Random Post: